
సాహిత్యం (8)
సాహిత్యం (లాటిన్ litterae నుండి (బహువచనం); అక్షరం) అనేది రచనల చేసే కళ మరియు ఇది ప్రచురించబడిన వనరులకు మాత్రమే పరిమితం కాదు (అయితే, కొన్ని పరిస్థితుల్లో వాటిని మినహాయించవచ్చు). సాధారణంగా చెప్పాలంటే, సాహిత్యం అనే పదానికి అర్థం "అక్షరాలతో సాన్నిహిత్యం" ("కళలు మరియు అక్షరాలు"లో వలె). రెండు ప్రాథమిక రచనా సాహిత్య వర్గాల్లో కల్పన మరియు కల్పనేతర వర్గాలు ఉన్నాయి.
(వికీపీడియా నుండ
తెలుగుభాషా సాహిత్యముతో పాటు సంస్కృతిలోని అనేక పార్శ్వాలను, స్వదేశీ భావనను, ఆత్మ నిర్థారతను అనేక స్తరాలలో నిలిపేందుకు ప్రయత్నించిన వారు ఒద్దిరాజు సోదరులు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. ఆరు వందల సంవత్సరాలు అణిగి ఉన్న కాకతీయ సీమలోని సాంస్కృతిక చైతన్యం సర్వతోముఖంగా వ్యక్తమైంది వీరి కృషితోనే. గాంధేయ జీవన విధానంకోసం వారు చేసిన కృషి ఒకవైపు చెప్పుకుంటే సాహిత్య రంగంలో వారు నిర్వహించిన పాత్ర అమోఘమైంది. సృజనాత్మక, పాత్రికేయ రూపాలలో ఉంటుంది. పౌఢ ప్రబంధం, సౌదామినీ పరిణయం, నవలలు, రుద్రమదేవి, భ్రమర, బ్రాహ్మణ సాహసము, స్త్రీ సాహసము, ప్రేమ ప్రవాహము, అవిగాక రవీంద్రుని 'రెక్' నవల అనువాదము, నౌకాభంగము, నిస్వార్ధ దరిద్రులు, నిరసనోపాఖ్యానం వంటి లఘు కావ్యాలు, నాటికలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆశువుగా సంస్కృతంలో కవిత్వం చెప్పగల దిట్ట. వారు సంస్కృత, ద్రావిడ, ఆంధ్ర, హిందీ భాషలలో 1200 పైగా గ్రంథాలు రచించిన మనీషి, 'పద్మవిభూషణులు. 1922లో తెనుగు పత్రిక స్థాపించి ఐదారు సంవత్సరాలు ఎంతో ఓపికగా నడిపించారు. ఈ పత్రిక మూలంగా ఎందరో వ్యాసరచయితలు వెలుగులోకొచ్చారు. సాహిత్యసంబంధ అంశాలను 'రిపోర్టింగ్' చేయడంలో ఒరవడి పెట్టింది వీరితోనే.
వీరి సాహితీ సృజన అన్ని ప్రక్రియల్లోనూ సాగింది. అలాగ వైవిధ్యంతో కూడిన రచనలు సుమారు 75 విరచించగా వాటిలో 32 మాత్రమే ప్రచురితమైనాయి. వీటిలో సీతారామచంద్రరావు పేరిట 58 గ్రంథాలు, రాఘవ రంగారావు పేరుతో 13 గ్రంథాలు కాకుండా ఇద్దరూ జంటగా రాసినవి 4 గ్రంథాలు ఉన్నాయి. అనువాదరంగంలో వారి ప్రత్యేకతగా చెప్పుకుంటే ఆంగ్లంలో స్వతంత్ర రచనలుచేశారు. అంతేకాదు వీరి ప్రత్యేకత వైజ్ఞానిక రంగంవైపు మళ్ళింది. ఫోటోగ్రఫీ, విద్యుత్తు చేతిపనులు, మున్నగు శాస్త్రాం శాలకు సంబంధించిన రచనలు సోదరకవులు బహుముఖ శాస్త్ర వైదుష్యాన్ని చాటుతాయి.
సంప్రదాయ, వైష్ణవ కుటుంబంలో జన్మించినా, వారి రచనలలో సంఘ సంస్కార దృక్పథం, ఆధునిక అభ్యుదయ భావాలు గోచరించడం అభినందనీయం. పురుష-స్త్రీ స్వామ్యాలను కాక సమస్వామ్యాన్ని వారు ప్రబోధించారు.
స్వయంకృషితో భాషలు నేర్చుకోవడంలో ఆంగ్లంతో మొదలుపెట్టి రవీంద్రనాథ్ రెక్ నవలలను 'నౌకాభంగం' పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఉర్దూ, గస్తీ తిరిగే గుర్రం సవారీల వద్ద నేర్చుకున్నారు. గ్రామంలో తోళ్ళవ్యాపారం చేసే తమిళ తురకతనికి తెలుగు నేర్పించి, అతడి వద్ద తమిళం నేర్చుకుని పుస్తకాలు చదివారు.
ఒద్దిరాజు సోదరులు కలిసి 'ఉపదేశ రత్నమాల, తిరుప్పల్లాండు, భక్తిసార చరిత్ర, సంస్కృత వ్యాకరణము రచించారు. చక్కని భాషలో, చక్కని భావంతో ఎన్నో కవితాఖండికలను రాశారు. వాటిలో కవితానైపుణ్యం, కల్పనా చమత్కృతి స్పష్టంగా దర్శనమిస్తాయి. ఉత్తమ కవి వానమామలై వరదాచార్యుల వారు రాసిన పోతనకావ్యం చదివి, తిరిగి వారు మత్తేభ మాలికలో రాసి చదువరులను ఆశ్చర్యచకితుల్ని చేశారు. వారు రాసిన పద్యాలు సమకాలంలోని విశేషాలను వ్యక్తం చేస్తారు.
వారి గ్రామం ఇనుగుర్తి గురించి చరిత్ర రాసినప్పుడు శాసనాలు యధాతథంగా రాసి అర్థం చెప్పి వాటి ఆనవాళ్ళు కూడా ఇచ్చి చారిత్రక పరిశోధకులుగా కీర్తిగడించారు. వారు పత్రికను నడపడంలో అంతరార్థం గురించి దాని ఆవశ్యకత గురించి పత్రికాముఖంగా తెలిపేవారు. వారు 'తెనుగు' పత్రిక నడిపే సమయంలో పత్రిక పైభాగాన ఇలా ప్రచురించేవారు.
తే.గీ. వార్తయందు జగము వర్థిల్లు తున్నది
యదియు లేనినాడ యఖిలజనులు
నంధకార మగ్నులగుదురు గావున
వార్త నిర్వహింప వలయు బతికి' అది వారి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఇటీవల ఒద్దిరాజు సోదరులు రచించిన ఐదు పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయి. 'మగ సంసారం, దుష్ట పంచాయతీ, నీవే నా హరివిల్లు, మేనరికం మరికొన్ని నాటకాలు. వారి కుటుంబ సభ్యులు పాల్గొని సభ జరగడం హర్షించదగినది.
నూట పాతిక సంవత్సరాల క్రితం జన్మించిన ఒద్దిరాజు సోదరులను ఇప్పటికీ స్మరిస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతున్నామంటే తెలుగు సాహిత్య సంస్కృతులకు వారు చేసిన సేవ విశిష్టమైనది.
ఒద్దిరాజు సీతారామచంద్రరావు 2.4.1887న జన్మించి తమ 75వ సంవత్సరం 28.1.1956న పరమపదించారు. వారి అనుజులు ఒద్దిరాజు రాఘవ రంగారావు 4.4.1894న జన్మించి 17.5. 1973న తమ ఎనభైవ యేట దివంగతులైనారు.
పర ప్రభుత్వ పాలనలో తెలుగు భాష నిరాదరణకు గురియైనా, ఆ గడ్డుకాలంలో కూడా తెలంగాణాలో వెల్లివిరిసిన సాహితీ చైతన్యానికి ఒద్దిరాజు సోదరులు ప్రముఖ సాక్ష్యంగా నిలిచారని చెప్పకతప్పదు.
ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే
కాలాన్ని కదలనీయను
అవసరమైనప్పుడల్లా
అగ్నిపుల్లతో-చీకటి
కొవ్వును కరిగించందే
కొత్తపొద్దు రానీయను''
అని ప్రతిజ్ఞ చేసి 'కవిత్వం నా మాతృభాష', 'కవిత నా శ్వాస', 'కవిత నా చిరునామా' అని ప్రకటించి 'ఇతివృత్తం మానవత్వం' అని ఉద్ఘాటించి సతతహరితంగా సాహితీ సృజనచేస్తున్న కవితా పథిóకుడు డా.సి.నారాయణ రెడ్డిగారు. ఏడు దశాబ్దాల నుంచి మానవచైతన్య చిత్రణమే ప్రధాన వస్తువుగా ఎంచుకున్న సినారె సరికొత్త ప్రక్రియలతో ఆధునిక తెలుగు సాహిత్యాన్ని విస్తృత పరిచారు. ఉత్తుంగ సాహితీశిఖరంలా నిలిచారు. 'నడక నా తల్లి, పరుగునా తండ్రి, సమత నా భాష అనే కవితాక్షరామ్నాయంలో సంస్కృతీ నాగరికతల అమృతభావనలను పొందుపరిచి 'అనంతరం నా పయనం, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు' అని మానవత మూల్యాలను వర్ణించి 'సంప్రదాయాన్ని జీర్ణించుకున్న, ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, అని ప్రయోగశాలిగా, పరిణామవేదిగా అద్భుత చరిత్రను సృష్టించుకున్న దార్శనికుడు సినారె గారు.
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన సినారె గారు 29 జూలై 1931న కరీంనగర్ జిల్లా వేములవాడ ప్రాంతంలోని హనుమాజిపేట గ్రామంలో బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతుల కళ్ల వెలుగులా జన్మించారు. బాల్య తొలిదశలోనే ఆయన గుండెలో కవిత్వం పాటరూపంలో దూసుకొచ్చింది. సొంత ఊరు చుట్టూ అల్లుకున్న పంటచేళ్ల హృదయరాగం, అక్కడి సెలయేళ్ల నడకల ఒయ్యారాలు హరికథకుల గీతాలు ప్రేరణ అయ్యాయి. ఎదుగుతున్న వయస్సుతో పాటు పాట కూడా కొత్త నడకలతో సాగింది.
సినారె పూర్తి పేరు సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి 'సత్య'శబ్ద సాహిత్యంలోని చేరింది. ఇంటిపేరులోని 'సింగి' చైతన్య రూపంలో విస్తరించింది. అలా కాగా సి. నారాయణరెడ్డి అనే పేరు సినారెగా జగత్ప్రసిద్ధమైంది.
సినారెగారు 1953-55 సం||లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ చదివి 1962లో పిహెచ్డి పట్టాపొందారు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యా లయంలో రీడర్, 1976లో ఆచార్యులుగా విద్యార్థులకు తెలుగుభాషా సాహిత్యాలను బోధించారు. అదే సమయంలో పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీడర్ 1976లో ఆచార్యులుగా విద్యార్థులకు తెలుగుభాషా సాహిత్యాలను బోధించారు. అదే సమయంలో పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకులుగా పనిచేశారు. పిదప 1981-1985 వరకు అధికార భాషా సంఘాధ్యక్షుడుగా, దేశంలో ప్రథమ సార్వత్రిక విశ్వవిద్యాలయం డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా 1989-92 వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా, ఆమహోన్నత విద్యాపీఠాల ప్రగతికి చక్కని ప్రణాళికలు రూపొందించి మేధావుల ప్రశంసలందారు.1992 రాష్ట్రభాషా సాంస్కృతిక సలహాదారుగా 1997లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా 1997 నుంచి 2003 దాకా రాజ్యసభ సభ్యులుగా విశిష్ట సేవలందించారు. ఈ పదవిని అందుకున్న తొలి దక్షిణభారత కవి నారాయణ రెడ్డి గారే. ఆ మహాకవి చాలా కావ్యాలకు రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులతో ''విశ్వంభర''కు అత్యున్నత భారతీయ జ్ఞానపీఠ అవార్డు లభించింది.
సినారెగారి సాహిత్యాన్ని గురించి వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు ఆ ప్రక్రియ సాగుతూనే వుంది. అంతేకాక ఆయన పేరుతో సాహిత్య సంస్థలు ఏర్పడ్డాయి. ఆయన పేరుతో విశిష్ట పురస్కారాలు కూడా ప్రదానం చేయబడుతున్నాయి. ఆయన పాటలు పాడి ఎందరో కళాకారులు సుప్రసిద్ధగాయకులయ్యారు. దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్లు సమర్పించి వాటి కీర్తి ప్రతిష్టలను పెంచుకున్నాయి. రాష్ట్రంలో, దేశంలో విదేశాల్లో విస్తృతంగా పర్యటించి తెలుగుభాషా సౌందర్యాలను చాటిచెప్పారు.
సినారె విద్యార్థి దశలోనే కిన్నెర, శోభ, తెలుగు, స్వతంత్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో కవితలు, వ్యాసాలు, ప్రకటించారు. అవి సాహితీపరుల హృదయాలను అలరిస్తుండేవి.
సినారెగారికి బాల్యదశలోనే సంస్కరణ దృక్పథం అలవడింది.
''మాలమాలయని మచ్చరించి మీ
సాలుదువ్వెదవదేలా!
మాలడే మహామంత్రియైన పూ
మాలవేసెదవదేలా!''
ఇలాంటివి మరెన్నో గేయాలు ఆ మహాకవి కలం నుంచి సమాజహృదయంలోకి దూసుకొచ్చి చిద్విలాసంగా పనిచేశాయి.
సినారె శ్రామిక జనపక్షపాతి. వారి త్యాగనిరతిని, ఆ చెమటలోని అందాలను గూర్చి ఎన్నో కావ్యాల్లో వర్ణించారు.
''శ్రమజీవి చెమట బిందువులో
ఆణిముత్యమూ వుంది
అగ్నిగోళమూ వుంది''
శ్రమశక్తి దోచుకుని సంపద పెంచుకునే దౌష్ట్యం నిర్మూలింపబడుతుందనే సత్యాన్ని ఉద్ఘాటించి వారికి అండగా నిలుస్తారు.
''లక్షచేతులు పండించే ధాన్యం
ఒక్కలోగిట్లో పరచుకుంటే
కోట్ల చెమటబొట్లు కురిసే మూల్యం
ఒక్క గుప్పిట్లో అణిగి వుంటే
అచ్చమైన సౌజన్యం
చచ్చుపీనుగులా పడి వుంటుందా?
రెచ్చిపోయిన రక్తఘోషతో
చిచ్చురెక్కలు సాచకుంటుందా''
అప్పుడు జ్వలించేది తిరుగుబాటేకదా!
''నరభోక్తలు మానవతను
నంజుకు తింటున్నప్పుడు
పరశక్తులు స్వజాతిపై
విరుచుకుపడుతున్నప్పుడు
కత్తులతో పాటుపైకి
సుత్తెలెత్తిపట్టించే
అడుగులతో పాటు పదును
కొడవళ్ళను కదిలించే
నాగళ్ళను, రోకళ్ళను నడిపించే
నౌకర్లను, పాలేర్లను ఉరిమించే
తిరుగుబాటులో కవితా
స్వరముద్రికలున్నవి''
అని తిరుగుబాటు కవిత్వం ప్రత్యేకతను తెలుపుతారు.
అణచివేతలతో గాయపడ్డ/మట్టిగుండె అలాగే వుండిపోదు. చతికిలబడదు. చిచ్చులా చెలరేగుతుంది. ఆ హృదయంలో విచ్చుకున్న జ్వాలల ధ్వనులు డప్పుల నాదంతో బహిర్గమ వుతుంది. అది భీకరమృగరాజు గర్జనలా వుంటుంది. ''డప్పంటే మూరెడు తోలుపేలికకాదు మట్టిగుండెల ఘోషలను పుక్కిటపట్టుకున్న మహోగ్రమృగేంద్ర కంఠం''తన రచనల్లో మానవత్వాన్ని ప్రధానంగా ఉల్లేఖించే సినారెగారు
''ఏ కులము వెన్నెలది?
తెమ్మరలెట్టి జాతికి చెందినట్టివి?
అట్టిదే కదా మానవత్వము
అన్నిటికీ ఎతైన సత్యము''అనడం ఆయన సదాశయాన్ని ప్రకటిస్తుంది.
మతం ఏదైనప్పటికీ అందులో ప్రతిపాదింపబడిన ధర్మాలు ఒక్కటే. దురభిమానం రగిలించుకుని కలహిస్తే మానవత్వం మలినమవుతుందనే విశిష్ట ధర్మాన్ని నొక్కి చెబుతారు సినారెగారు.
''ఎవడు హిందు ఏవడు తురక ఎవడురా కిరస్తానీ?
ఎవరిది తెలుగెవరిది రవమెవరిది హిందుస్తానీ
ఒకేతోట వికసించిన రకరకాల పువ్వులురా
ఒకేవాణి గుడిలో వెలుగొందిన మణిదివ్వెలురా!''
ఇలాంటివే మత సామరస్యాన్ని పెంపొందించే గీతాలు సినారె కలం నుంచి అసంఖ్యాకంగా వెలువడ్డాయి. అందులో కొన్ని లలితగేయాలై మరికొన్ని చిత్రగీతాలై సమాజహృదయంలో ప్రవేశించి మతవిద్వేషాలను తగ్గించడంలో ఉపకరించాయి.
సినారెగారి ఆకాంక్ష
''ఒక్కనోరు-
వందభాషలుపలకాలని
రెండు చేతులు-
వెయ్యి సముద్రాలు ఈదాలని
లక్ష ఊహలు-
పది పంక్తుల్లో ఒదగాలని
కోటి ఉద్యమాలు-
ఒక్క ప్రగతిగా వెలగాలని'' అనే ఆయన సంకల్పం వజ్రతుల్యమైంది.''నవ్వనిపువ్వు'' నాటినుంచి ''అలలెత్తే అడుగులు'' (2013) దాకా వెలువడిన సినారె (83) రచనల సమాజం-సమాజానికి హృదయం లాంటి మనిషి గురించి, ప్రకృతి మానవప్రకృతికి మధ్య వున్న అనుబంధాల గురించే అధికంగా ప్రస్తావింపబడింది. ఆమహాకవి అక్షరం గీస్తే, పదం రాలిస్తే, పాదాన్ని చిలకరిస్తే అది అద్భుతకవిత్వమై రసజ్ఞ జగత్తును మురిపిస్తూంది. వయస్సులో ఎనభైమూడు వసంతాలు దాటినప్పటికీ ఇంకా యువతతో పోటీపడుతూ శక్తివంతమైన, భావసౌజన్యధారతో భాసిస్తున్న సినారె గారి లక్ష్యంతో ఈ వ్యాసం ముగుస్తుంది.
''రాస్తూ రాస్తూ పోతాను-సి
రా ఇంకేవరకు-
పోతూ పోతూ రాస్తాను-వ
పువువాడేవరకు''
మన ప్రాచీనాలంకారికులు చెప్పిన నవరసాల్లో హాస్యం కూడా ఒకటి. హాసం అంటే నవ్వు. ఆ నవ్వును పుట్టించేదే హాస్యం. నవ్వు నాలుగందాల చేటని కొందరు నీరసవాదులు నిరసించినా, నేడు “నవ్వు” అన్నదానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించడం వల్లే చాలా ఊళ్లలో ‘హ్యూమర్ క్లబ్స్’ వెలిసాయి.
ఈ పరిచయం శ్రీపాద వారి “అనుభవాలూ జ్ఞాపకాలూనూ” గురించి. ఇంట్లో చిన్నప్పటి నుంచి శ్రీపాద వారి చిన్నకథల పుస్తకాలున్నా కూడా ఎప్పుడు చదివిన పాపాన పోలేదు .
చాగంటి సోమయాజులు (చాసో)
1942 సంవత్సరం ప్రారంభంలోనో మధ్యలోనో చదలవాడ పిచ్చయ్య మావూరు దిగబడ్డాడు. ముస్లిం టోపీ ఒకటి నెత్తిమీద పెట్టుకున్నాడు. సెట్టి ఈశ్వరరావూ అతనూ కలసి మా ఇంటికి వచ్చారు.
వ్యక్తిగా గురజాడ కష్టజీవి. చిన్నతనం నుంచీ కూడా తన శక్తికి మించిన శ్రమకు అలవాటుపడినవాడు.అనేక బాధ్యతల్నీ, బరువుల్నీ నెత్తికెత్తుకునే తత్వం.అవన్నీ స్వీకృతా లూ, స్వీయకృత్యాలే! ఆయన దినచర్యని పరిశీలిస్తే ఎన్నో అబ్బురపరిచే అంశాలేగోచరిస్తాయి.ఒక్కసంగతి చూడండి. అతివిస్తృతమైన పుస్తక పఠనం. ఐదు వందల పేజీల గ్రంథాన్నైనా -అతివేగంగా రెండు మూడు రోజుల్లో ఆకళింపు చేసేసుకోగల ధీధిషణలు.
Stay Connected with TAGKC
MORE ARTICLES
- ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల Be the first to comment!
- సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు Be the first to comment!
- మానవతా పరిమళ ప్రవాహం సినారె కవిత్వం Be the first to comment!
- హరికథ-ఆవిర్భావం Be the first to comment!
- తొలి తెలుగు శాసనం ఎక్కడ? Be the first to comment!
- తెలుగు సాహిత్యోద్యమనేత సురవరం ప్రతాపరెడ్డి Be the first to comment!
Galleries
Who's Online
We have 17 guests and no members online